తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవి గుప్త

డీజీపీ
Spread the love

Telangana: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా.. 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్, మే 12: తెలంగాణలో (Telangana) ఎన్నికల (Loksabha Elections 2024) ఏర్పాట్లు పూర్తి చేశామని రవి గుప్త తెలిపారు. ఆదివారం రవి గుప్త (Telangana DGP Ravi gupta) మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా.. 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 7 వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు చేశామని.. 89 ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ చెక్‌పోస్టులు, 173 అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు‌గా గుర్తించినట్లు డీజీపీ చెప్పారు.

డీజీపీ
డీజీపీ

రూ.186కోట్ల విలువచేసే మద్యం, డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామని.. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బలాలతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా కోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో పారామెలిటీ బలగాలతో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సోషియల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ ద్వారా సోషియల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీజీపీ రవి గుప్త వెల్లడించారు.

Back To Top