తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలే రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా మారాయని అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకోము – బాలాజీ సింగ్ ఠాకూర్
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాలాజీ సింగ్ డిమాండ్ చేశారు.
ఢిల్లీ సీఎం సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు
ఆర్యవైశ్య మహాసభ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. తిరుమల: ఆర్యవైశ్య మహాసభ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు యెన్నం భూపతి రెడ్డి, నాయకులు ఆనంద్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, ఆర్యవైశ్య సంఘ […]
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి – సీఐ రఘువీర్ రెడ్డి
వెల్దండ మండల కేంద్రంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీఐ రఘువీర్ రెడ్డి హాజరై ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
కరీంనగర్ చెరువుల సుందరీకరణకు శ్రీకారం
కరీంనగర్ కొత్తపల్లి, రేకుర్తి, తీగలగుట్టపల్లి చెరువులకు నూతన రూపు.ఈ నెల నాలుగో వారంలో పనులకు శ్రీకారం చుట్టనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.
గోసేవే గోసంరక్షణ – గరికపాటి
ఎ.ఎస్. రావు నగర్ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మశ్రీ, ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గోవిందుడు–గోసంరక్షణ అంశంపై ప్రవచనం చేశారు.
లేఅవుట్ల అనుమతికి నిబంధనలు పాటించాల్సిందే – కలెక్టర్ చిత్రా మిశ్రా
లేఅవుట్ల అనుమతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి – ఎంపీడీవో శశికళ
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో శశికళ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో శశికళ సూచించారు. ఈశాల తక్కల్లపల్లి గ్రామంలో 102 ఇళ్లు మంజూరై, 6 పూర్తయ్యాయని, 24 స్లాబ్ దశలో, 72 బేస్మెంట్ దశలో ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 16లోగా ప్లాస్టరింగ్ పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని, గడువులోగా పనులు పూర్తి చేయని లబ్ధిదారుల […]
పోలీస్ శాఖలో రూ.1.40 కోట్ల జీతాల కుంభకోణం బట్టబయలు
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకోణాన్ని అధికారులు వెలికితీశారు.
తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి – మంత్రి సీతక్క
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వదిలేయకుండా కాపాడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

