ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా మే 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా మే 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
కలెక్టర్ కార్యాలయంలో టాస్క్, ఎంప్లాయిమెంట్, ఇండస్ట్రియల్, స్పోర్ట్స్ శాఖల అధికారుల సమక్షంలో పోస్టర్ను విడుదల చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ—
- నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.
- యువతీ యువకులు తమ ప్రతిభను ప్రదర్శించి మంచి ఉద్యోగాలను పొందాలని సూచించారు.
- ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి.వై.ఎస్.ఓ శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధి కల్పనా అధికారి తిరుపతిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

