Headline
గ్యాస్
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కు చుక్కెదురు

ఎమ్మెల్సీ కవిత
Spread the love

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు అస్సలు కనిపించట్లేదు. తనకు బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ రెండింటినీ కోర్టు కొట్టేసింది. దీంతో కవితకు మరో బిగ్ షాక్ తగిలినట్టయ్యింది. కాగా.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేయడానికి అధిష్టానం కవితను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని చెప్పినప్పటికీ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మరోవైపు.. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ అర్హత ఉందన్న విషయాన్ని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇదివరకే న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.. తిరస్కరిస్తూ తీర్పును వెలువరించారు.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

కాగా.. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తీహార్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. గత నెల 22న రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే-02కు తీర్వు రిజర్వు చేశారు. అయితే మే-02న తీర్పు వస్తుందని అంతా భావించగా.. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు మే-06కు రిజర్వ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్‌ పిటిషన్లపై తీర్పును మే-06న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒకవేళ కవితకు బెయిల్‌ లభిస్తే జ్యుడీషయల్‌ రిమాండ్‌ నుంచి మినహాయింపు లభిస్తుందని అందరూ భావించారు కానీ.. అదేమీ జరగలేదు. ఇప్పటికే పలుమార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరిస్తూనే ఉన్నది. ఆ మధ్య తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరగా కోర్టు తిరస్కరించింది.

షాకుల మీద షాక్‌లు!

Back To Top