చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి

వ్యవసాయ
Spread the love

వంగూరు మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అన్నారం గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి.

వంగూరు: వంగూరు మండలంలోని అన్నారం గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవియెన్ రెడ్డి, తన కుటుంబ సభ్యులు, మిత్రబృందం, మరియు సహచరులతో కలిసి శ్రీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని ప్రార్థించారు.

చెన్నకేశవ స్వామి మహిమ:

కేవియెన్ రెడ్డి చెన్నకేశవ స్వామి అనగా శ్రీకృష్ణుడిని సూచిస్తారని, “చెన్న” అనగా అందమైన అని అర్థమని వివరించారు. స్వామి దర్శనం పూర్వ జన్మ సుకృతమని, స్వామి కృపతో రైతులు సుఖశాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

రైతు సంక్షేమంపై ప్రశంసలు:

కేవియెన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధి అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ పథకాలను గ్రామాల్లో రైతులకు వివరించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.


పాల్గొన్న ప్రముఖులు:


ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ నారాయణరెడ్డి, బొజ్జ కృష్ణారెడ్డి, బొజ్జ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top