డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి 20 రోజుల జైలు శిక్ష

డ్రంక్
Spread the love

తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులు పోలీసుల వలలో చిక్కారు.

తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులు పోలీసుల వలలో చిక్కారు. వాహన తనిఖీల సమయంలో తాగి బండి నడిపినట్లు నిర్ధారణ కావడంతో, వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

జిల్లా జడ్జి శృతి దూత విచారణ జరిపి, ఈ మేరకు తీర్పు వెలువరించారు:

  • మామిళ్ళపల్లి మల్లేష్ (S/O నారాయణ, ఆలేరు గ్రామం) కు 20 రోజుల జైలు శిక్ష విధించారు.
  • రాములు (S/O నిరంజన్) కు ₹1500 జరిమానా, సీట్ రైసింగ్ ఆఫ్ ద కోర్టు శిక్ష విధించారు.
  • భోగరాజు రాములు (S/O తిరుపతయ్య) కు కూడా ₹1500 జరిమానా, సీట్ రైసింగ్ ఆఫ్ ద కోర్టు శిక్ష విధించారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగిస్తారని, మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎడల కేసులు నమోదు చేస్తామని స్థానిక ఎస్సై బి. నరేష్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top