Headline
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
Silver Price
Silver Price: కుప్పకూలబోతున్న వెండి ధర..! మార్కెట్‌ నిపుణుల హెచ్చరిక..?

Karimnagar:కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరణ

కరీంనగర్
Spread the love

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా(Karimnagar) కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్(Karimnagar) జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఉద్యమ నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు కరీంనగర్(Karimnagar) జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన మేడిపల్లి సత్యం పార్టీ–ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత జిల్లా అధ్యక్షుడిపై ఉందని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నేతలకు కాంగ్రెస్‌లో అవకాశాలు లభిస్తున్నాయని, ప్రజలు అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనే విశ్వాసం చూపారని పేర్కొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాలో తొలిసారి దళిత నాయకుడిగా డిసిసి అధ్యక్ష పదవి రావడం చారిత్రాత్మకమని, ఇది కార్యకర్తల అదృష్టమని అన్నారు.

మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ ఇచ్చిన బాధ్యతను గౌరవంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించి, గ్రామాభివృద్ధి కోసం వారిని ముందుకు నడిపిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ మరల అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. “కొండ బలం లేదు, వంగ బలం లేదు, సాధారణ కార్యకర్తగా ఉద్యమం నుంచి వచ్చిన నేను, నేడు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం పొందడం నా జీవితంలో గొప్ప ఘనత” అని అన్నారు.

సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంఎల్సీ బల్మూరు వెంకట్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ డిసిసి అధ్యక్షుడు అంజన్ కుమార్, సిరిసిల్ల–జగిత్యాల డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top