Site icon Chaithanya Galam News

బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి – కమిషనర్ తరుణ్ జోషి

తరుణ్

తరుణ్

Spread the love

ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు “న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి” అని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు.

ఆమనగల్లు : ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు “న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి” అని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు.

మంగళవారం ఆయన పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్ కేసులు, రౌడీ షీటర్లు, అనుమానితులపై నిఘా, బీట్లు, పెట్రోలింగ్, సిబ్బంది పనితీరు వంటి అంశాలను ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు వద్ద సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలి. విధుల్లో అలసత్వం లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలి” అని సూచించారు.

కమిషనర్ వెంట డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకీ రెడ్డి, ఎస్ఐ సీతారాం రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version