సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్ సోమవారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిశారు.
విజయవాడ: ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్ సోమవారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిశారు.
2017లో ప్రీతిని అత్యంత కిరాతకంగా హత్యాచారం చేసిన ఘటనపై ఇప్పటికీ న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ తొమ్మిదేళ్లు గడిచినా న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వేదన వ్యక్తం చేశారు.
వారి ఆవేదనను విన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, “మీకు అన్ని విధాలా అండగా ఉంటాను” అని హామీ ఇచ్చి కుటుంబానికి భరోసా కల్పించారు.

