రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంచి సేవాభావం కలిగిన నాయకుడైన లక్ష్మీనారాయణను గెలిపించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంచి సేవాభావం కలిగిన నాయకుడైన లక్ష్మీనారాయణను గెలిపించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
వివేక్ మాట్లాడుతూ గతంలో టీ.జీ. వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఆర్యవైశ్య సంఘానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం సంతోషకరమని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా అనేక మంది వైశ్యులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని, తన నియోజకవర్గంలో కూడా వైశ్యుల మద్దతు బలంగా ఉందని తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు మరిన్ని నిధులు కేటాయించాలని కోరుతానని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మరణించిన వైశ్యుడు నాగరాజు కుటుంబానికి 15 సంవత్సరాల పాటు పెన్షన్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల ప్రారంభించిన ఆర్యవైశ్య వెబ్సైట్ ద్వారా సమాజ సభ్యుల వివరాలు నమోదు అవుతున్నాయని, ఇంకా నమోదు చేయని వారు వెంటనే నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

