Site icon Chaithanya Galam News

రక్తమోడుతున్న జాతీయ రహదారులు !

Spread the love

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పై సంవత్సర కాలంలో దాదాపు 600 మరణాలు.
రోడ్డున పడుతున్న కుటుంబాలు.
అనాధలుగా మారుతున్న పసిప్రాణులు.
ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.
ప్రమాదాలపై ప్రజలకి అవగాహన సదస్సులు నిర్వహించాలి.
ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి.
హైదరాబాద్ శ్రీశైలం రహదారిని వెంటనే నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలి మరియు డివైడర్ను నిర్మించాలి.
రోడ్డు ప్రమాదాలపై నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్,తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ వ్యాఖ్యలు.

హైదరాబాద్ (చైతన్యగలం)స్పెషల్ డెస్క్: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి మరియు కోదాడ-జడ్చర్ల రహదారులపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ మరియు టిపిసిసి అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ స్పందించారు.

చైతన్యగలం దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జాతీయ రహదారులపై డివైడర్లు లేని కారణంగా వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండడంతో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి మరియు కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారులపై ఈ విధంగా రద్దీ పెరగడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి అని రహదారులు రక్తమోడుతున్నాయి అని ప్రతిరోజు కనీసం నాలుగు లేదా ఐదు మరణ వార్తల వినాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్లు బాగుపడ్డాయి అని ఆనందించాలో లేదా నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తున్నారు అని బాధపడాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది అని ఆయన వాపోయారు.ఇన్ని జరుగుతున్నా కూడా నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

సంవత్సర కాలంలో 600 మంది ఈ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో మరణించారని ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని ఆయన అన్నారు.600 మంది మరణించారు అంటే 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని అర్థం అని ఆయన అన్నారు.అనేక మంది చిన్నారులు అనాధలుగా మారారని,రోడ్డు ప్రమాదాలతో కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థలో ఇతర అసాధారణ మరణాలు సంభవించినప్పుడు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చట్టాలు ఉన్నాయని కానీ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరంగా భరోసా కల్పించి వారిని ఆదుకునేలా చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.బీమా ద్వారా డబ్బులు వచ్చినా కూడా అవి కుటుంబ అవసరాలు తీర్చేది కావని ఆయన పేర్కొన్నారు.

జాతీయ

ప్రభుత్వం,అధికారులు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని,అధికారులు దానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించాలని వాటిని ప్రభుత్వంతో మాట్లాడి చట్టాలుగా మార్చే బాధ్యత ప్రజాప్రతినిధులుగా తాము తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బాలాజీ సింగ్ రవాణా శాఖ అధికారులకు మరియు ఇతర శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

Exit mobile version