Site icon Chaithanya Galam News

మాసుపేటలో పొగాకు రైతుల ఆందోళన

పొగాకు

పొగాకు

Spread the love

నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం మాసుపేట గ్రామంలోని ఐటీసీ కంపెనీ గోడౌన్ ముందు సోమవారం పొగాకు రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు.

నందికొట్కూరు, మే 11 (చైతన్య గళం): నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం మాసుపేట గ్రామంలోని ఐటీసీ కంపెనీ గోడౌన్ ముందు సోమవారం పొగాకు రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు.

రైతులు మాట్లాడుతూ, “ క్వింటాల్‌కు 16 వేల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ, ఇప్పుడు తీరా 9 వేలకే కొనుగోలు చేస్తామని చెబుతోంది. ఇది రైతులపై తీవ్ర అన్యాయం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కష్టార్జిత పంటకు సరైన ధర ఇవ్వాలని, 16 వేల రూపాయలకే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “రైతుల పట్ల ఈ నిర్లక్ష్యం కొనసాగితే మరింత ఉద్ధృతమైన ఆందోళనలు చేస్తాం” అని హెచ్చరించారు.

ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను బహిరంగంగా వ్యక్తం చేశారు.

Exit mobile version